బాలిక పై సీఐ అత్యాచారం.. పోక్సో చట్టం కింద కేసు నమోదు

-

ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ అధికారి సభ్య సమాజం తలదించుకునేవిధంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి 16 ఏళ్ల బాలిక పై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో అతని పై హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.

ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్ సీఐగా పని చేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పని చేశాడు. ఆ సమయంలో హన్మకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడి సన్నిహితంగా మెలిగేవాడు. అనంతరం ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయ్యాడు. ఆమెతో స్నేహాన్ని కొనసాగించాడు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీఆర్ సీఐగా బదిలీ పై వచ్చాడు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆ మహిళ కూతురు పై కన్నేశాడు. అదును చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లికి జరిగిన విషయం చెప్పడంతో తల్లి కేయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు సీఐ సంపత్ పై అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news