తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్ !

-

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జ్ఞానేశ్వర్ టిడిపి కండువా కప్పుకున్నారు.

కాసానిని చంద్రబాబు టిడిపిలోకి ఆహ్వానించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షులు బక్కని నరసింహులు గారు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. కాసాని జ్ఞానేశ్వర్ ను టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version