కాంగ్రెస్ లో వైసీపీ విలీనం… క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్

-

వైసిపి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతున్న వార్తలపై… కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత… అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అధికారంలోకి చంద్రబాబు ప్రభుత్వం.. వైసీపీ పార్టీని చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. వైసిపి పార్టీ కార్యాలయాలను కూడా కూల్చేందుకు… ప్రయత్నాలు చేస్తోంది.

Karnataka Deputy CM DK Shivakumar denied the news of meeting with Jagan

ఈ తరుణంలోనే… బెంగళూరుకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి డికె శివకుమార్తో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. అలాగే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు డీకే శివకుమార్తో చర్చలు నిర్వహించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే… జగన్మోహన్ రెడ్డి తో సమావేశం అన్న వార్తలను తీవ్రంగా ఖండించారు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్.

మా ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని నకిలీ ఫోటోలను సృష్టించాలని ఫైర్ అయ్యారు. నేనెప్పుడూ జగన్మోహన్ రెడ్డి ని అస్సలు కలవలేదని… ఎవరు కూడా దీన్ని నమ్మవద్దని కోరారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version