డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టెట్ డీటేయిల్స్ ఎడిట్ కి ఛాన్స్..!

-

డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాక గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎడిట్ చేసుకునేందుకు కన్ పార్మ్ చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది. ఈనెల 12, 13 తేదీలలో ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 13వ తేదీ తరువాత మార్పులకు ఎలాంటి ఛాన్స్ లేదని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది.

తెలంగాణ టెట్ 2024 ఫలితాలు జూన్ 12వ తేదీ విడుదలైన విషయం విధితమే. మే 20 నుంచి జూన్ 02 వరకు జరిగిన ఈ పరీక్షలకు పేపర్ 1కి 85,996 మంది, పేపర్ 2 కి 1, 50, 491 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిజల్ట్స్ లో పేపర్ 1లో 57,725 మంది.. పేపర్ 2లో 51, 443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. డీఎస్సీ ఫైనల్ కీ విడుదల కాగా.. అందులో తప్పులున్నాయని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో డీఎస్సీ ఫలితాలు కూడా విడుదల కానున్నట్టు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news