రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపులపై  కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకోవాలంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

Padi Kaushik Reddy

మరోవైపు పీఏసీ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ మీడియా ప్రతినిధి అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నాడని.. కౌశిక్ రెడ్డితో అడగ్గా.. కౌశిక్ రెడ్డి ఇలా స్పందించాడు. గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పాలి. రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.  ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాడు కాబట్టి రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి, BRS భవన్ లో ప్రెస్ మీట్ పెడదామన్నారు కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news