ఆర్టిజన్ లకు కేసీఆర్ సర్కార్ తీపికబురు

-

ఆర్టిజన్ లకు కేసీఆర్ సర్కార్ తీపికబురు అందించారు. విధుల నుంచి ప్రభుత్వం తొలగించిన ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రకటించారు.

ఈ మేరకు మంగళవారం హైదరాబాదులోని సచివాలయంలో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్లా బలాల, ఆర్టిజన్ సంఘాల ప్రతినిధులు మంత్రిని, ట్రాన్స్ కో, జెన్ కో ఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండి రఘురామరెడ్డితో కలిసి చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాస్తవానికి ఔట్ సోర్సింగ్ పేరుతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్లను దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించారని గుర్తు చేశారు. ఇటీవల సమ్మె పేరుతో విధులకు గైర్హాజరైన 196 మంది ఆర్టిజన్లను మానవీయ కోణంలోనే తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news