తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ ఫై ప్రభుత్వం కీలక ప్రకటన

-

తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ ఫై ప్రభుత్వం కీలక ప్రకటన వచ్చింది.  రైతు రుణమాఫీ కింద ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.12,717 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనిద్వారా ఇప్పటివరకు 22.46 లక్షలమంది రైతులు లబ్ధి పొందారని… ఇంకా 7.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6400 కోట్లు జమ చేయాల్సి ఉందని తెలిపింది.

మిగతా సొమ్మును త్వరలోనే జమ చేస్తామని పేర్కొంది. ఇది ఇలా ఉండగా, గృహలక్ష్మి పథకానికి ఎంపికైన దరఖాస్తుదారులకు 3 దశల్లో రూ. 3లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే ఒక్కో నియోజకవర్గానికి 3000 మంది చొప్పున మొత్తం 3,65,975 మంది లబ్దిదారులను గుర్తించి, మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు.

35,000 మందికి సీఎం కోటా కింద మంజూరు చేయనున్నట్టు తెలిపారు.ఇప్పటివరకు లక్ష ఆరు వేల మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని మంజూరు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 15 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా, 10 లక్షలకు పైగా అర్హులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news