ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టింది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్రభుత్వానికి మాజీ సీఎం  కేసీఆర్ ఫోబియా పట్టిందని  కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే కేసీఆర్ ఆనవాళ్లను తుడిపెస్తామని అంటున్నారు. చేరిపేయలేని, తుడిపేయలేని, దాచెయ్యలేని ఆనవాళ్లు కేసీఆర్ ఆనవాళ్లు. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్. కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్. మిషన్ భగీరథ నల్ల నీళ్లలో కేసీఆర్. పాలమూరు జల ధారలో కేసీఆర్. సీతారామ ఎత్తిపోతలలో కేసీఆర్. యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్. విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్.

మెడికల్ కాలేజీల వైద్య విద్య విప్లవంలో కేసీఆర్. కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్. కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్. మీరు కూర్చున్న సచివాలయపు సౌధ రాజసంలో కేసీఆర్. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ సృజనలో కేసీఆర్. వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్. అంబేడ్కర్ విగ్రహ మెరుపులో కేసీఆర్. అమర దీపం ఆశయల్లో కేసీఆర్. ఇలా కేసీఆర్ గురించి చెబుకుంటే పోతే చాలానే ఉన్నాయని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news