జూనియర్ అసిస్టెంట్ లకు గ్రేడ్ 3 ఈవోలుగా ప్రమోషన్..!

-

మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్ లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నది ఇవ్వనుంది ప్రభుత్వం. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్ లు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. సెక్రటేరియట్ లో మంత్రి సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాల స్వీకరణ జరిగింది. ఈ సమయంలో ఆనందభాష్పాలు రాల్చారు నూతన ఈవోలు. దసరా పండుగ వారం రోజుల ముందుగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేసారుఈవోలు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందనడానికి వీరి ప్రమోషన్లే ప్రత్యక్ష ఉదాహరణ అన్న మంత్రి.. ఇప్పటికే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవోలుగా పలువురికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేసారు మంత్రి సురేఖ. గత BRS ప్రభుత్వం ఉద్యోగులను అణచివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. దేవాలయాల ప్రగతికి, దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఉద్యోగులు పునరంకితం కావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news