నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

-

తెలంగాణ బిజెపి పార్టీ కీలక ప్రకటన చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది బిజెపి పార్టీ. నల్గొండ, ఖమ్మం మరియు వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని తాజాగా బిజెపి పార్టీ ప్రకటించింది. ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ బిజెపి పార్టీ.

తన కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. అలాగే గులాబీ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురిలో… అందరూ బలమైన నాయకులు కావడం విశేషం. కాగా ఇప్పటివరకు 30 వరకు ఈ ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు అయ్యాయట. మే నెల చివర్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news