ఫోన్ ట్యాపింగ్ చేసే రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు – గ్యాదరి కిషోర్‌

-

సీఎం రేవంత్ రెడ్డి 4 లక్షల సిమ్ కార్డులు మార్చాడని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 4 లక్షల సిమ్ కార్డులు పెట్టుకోని ఆ సిమ్ కార్డులతో ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి అని ఒక వ్యవస్థే ఉండేదని పేర్కొన్నారు.

gyadari kishore on cm revanth

సొంత పార్టీ వాళ్ల ఫోన్ ట్యాపింగ్ చేసే రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విచిత్రంగా ఉందని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఏమో ప్రతి మహిళకు లక్ష రూపాయిలు ఇస్తాను అంటాడు.. సీఎం రేవంత్ రెడ్డి ఏమో ప్రతి మహిళకు 2500 ఇస్తాను అంటాడన్నారు. రేవంత్ ఇస్తానన్న 2500 కే దిక్కులేదు పైన ఉన్న అయినా లక్ష ఇస్తా అని మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌.

Read more RELATED
Recommended to you

Latest news