వెంటనే రాష్ట్రంలో కుల గణన మొదలుపెట్టండి : VH

-

తాజాగా గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి నుండి.. పీసీసీ బాధ్యతలు మహేష్ గౌడ్ స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ పీసీసీ బాధ్యతల స్వీకరణ సభ వేదిక పై పార్టీ సీనియర్ నాయకుడు V.హనుమంతురావు కీలక కామెంట్స్ చేసారు. మహేష్ గౌడ్ కార్యకర్తలు అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త, పాత నాయకుల్ని కలపాలి. కలిసి పని చేసేలా మహేష్ గౌడ్ చూడాలి. అయితే ఇంత అబద్దాల చెప్పే ప్రధాని నీ ఎప్పుడు చూడలేదు. ప్రస్తుతం మోడీ కొత్త నాటకం కి తెర లేపారు.

అయితే రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్రంలో కుల గణన మొదలుపెట్టండి అని పేర్కొన్నారు. అలాగే ముప్పై ఏండ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త వాళ్ళకు వ్యతిరేకం కాదు. పార్టీ కార్యకర్తల మీద ఉన్న కేసులు విత్ డ్రా చేయాలి. మన ప్రభుత్వం వచ్చినా కేసులు ఉన్నాయని బాధలో ఉన్నారు కార్యకర్తలు అని VH తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version