Womens Day : రెండు తెలుగు రాష్ట్రాల మహిళలకు శుభవార్త..నేడు ప్రభుత్వ హాలీడే

-

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇవాళ్టి రోజున శెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మహిళా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇస్తోంది.

ఇందులో భాగంగానే ఇవాళ్టి రోజున సెలవు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

అటు ఏపీలోనూ తెలంగాణ తరహాలోనే.. మహిళలకు ప్రభుత్వ సెలవు ప్రకటిస్తూ.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇవాళ ఏపీలో మహిళలకు సెలవు ఉండనుంది. కాగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నేపథ్యం లో.. తెలంగాణ రాష్ట్రంలో ” కేసీఆర్‌ మ‌హిళా బంధు” అనే పేరుతో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news