మహిళా ఎమ్మెల్యేల పై రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల హరీశ్ రావు ఫైర్..!

-

అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్  రావు ఫైర్ అయ్యారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభా నాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని.. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామని.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఆయన అన్నారు.

సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయం అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమనడం తప్పా..? రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీయం తప్పా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్క బెడుతున్నారు అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version