కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసిన మంత్రి హరీశ్‌రావు

-

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. దేశరక్షణ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేట్‌పరం చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశభద్రత, 74 వేల మంది ఉద్యోగుల్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పనిఉండేదని.. దాదాపు 930 కోట్ల విలువైన ఆర్డర్లను సమయానికి పూర్తిచేశారని లేఖలో పేర్కొన్నారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లను అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదని పేర్కొన్నారు. ఆ విషయాన్ని సాకుగాచూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని “సిక్ ఇండస్ట్రీ” గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు….. పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతింటుందని…….. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని హరీశ్‌రావు లేఖలో వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news