మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజి మంత్రి హరీష్ రావు లేఖ

-

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న అంతగిరి రిజర్వాయర్ అలాగే రంగనాయక సాగరు పూర్తిగా ఎండిపోయాయి. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కూడా అడుగంటాయి.

harish rao letter to uttam kumar redddy

ఓవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక… రైతులు ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నీళ్లు లేకపోవడంతో పంటలు వేయాల లేదా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి నేపథ్యంలో రాజకీయాలు పక్కకు పెట్టి ఈ రిజర్వాయర్లు అన్నిటిని నీటితో నింపాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. లేకపోతే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొంటాయని హెచ్చరించారు. వెంటనే ఉత్తంకుమార్ రెడ్డి స్పందించి నీటిని విడుదల చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news