కేసీఆర్ తో 3 గంటల పాటు హరీష్ రావు భేటీ

-

Harish Rao meets KCR for 3 hours: కేసీఆర్, హరీష్ రావు భేటీ ఇవాళ జరిగింది. మూడున్నర గంటల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారు హరీష్ రావు.  ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు.

Medigadda KCR and Harish Rao got a huge relief in the High Court
Medigadda KCR and Harish Rao got a huge relief in the High Court

జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చ జరిగింది. కాళేశ్వరంపై NDSA ఇచ్చిన రిపోర్టును నిర్మాణ సంస్థ L&T తప్పు పట్టడంపై చర్చించారు నేతలు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీపై రిపోర్ట్ ఎలా ఇస్తారన్న ఎల్ అండ్ టీ సంస్థ ప్రశ్నని కమిషన్ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సంస్థ లేఖతో NDSA నివేదికలో డొల్లతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పొర్తయ్యేవరకు జరిగిన ప్రక్రియనంతా వివరించేందుకు…. వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్ కోరాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news