కాంగ్రెస్ ..​ మా ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంది : హరీశ్ రావు

-

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను ఆ పార్టీ బెదిరించి, భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నారని విమర్శించారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బిహార్, గుజరాత్​లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని .. ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో విద్యార్థులు నీట్ పరీక్ష రాశాయని.. వారి భవిష్యత్తు అయోమయంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురి చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ అధికార పార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా, కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయటం దారుణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news