నిన్నటి నుంచి భోజనం కూడా చేయలేదు.. కన్నీరు పెట్టిన మంత్రి కొండా సురేఖ

-

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఫైవ్ మంత్లీ కొండా సురేఖ స్పందించారు. తాజాగా గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక మహిళ మంత్రిని అవమానిస్తూ సోషల్ మీడియాలో పేస్ పోస్టులు పెట్టడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టారన్నారు. కోల్పోయిన బాధలో బిఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు అని విమర్శించారు. ఆ పార్టీ మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పట్ల ఇలాంటి ట్రోలింగ్ వ్యాఖ్యలు చేసే ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ.

ఇప్పుడే కాదు.. మొదటి నుంచి కూడా కేసీఆర్ మహిళలను దారుణంగా అవమానిస్తూనే వస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే బస్సుల్లో డిస్కో డ్యాన్సులు చేస్తున్నారని అవమానించారని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు కేటీఆర్ బీఆర్ఎస్   చేసింది ఏంటి అని ప్రశ్నించారు.  ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటా.. కానీ  ఒక మహిళను నేరుగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా అవమానించడం సరికాదన్నారు.  ట్రోలింగ్స్ వల్ల నిన్నటి నుంచి తాను భోజనం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ.

Read more RELATED
Recommended to you

Latest news