బ్రేకింగ్ న్యూస్  : శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత 

-

శంషాబాద్ ఎయిర్ ఫోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబట్టాయి. రూ.50కోట్ల విలువైన డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు లావోస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిననలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. రూ.50కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల కొకైన్ ను సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు. లావోస్ నుంచి హైదరాబాద్ కి తీసుకొస్తున్న తరుణంలో పట్టుబట్టారు. లావోస్ నుంచి ఢిల్లీకి చేరుకొని.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారు. 

వీరు  బ్యాగ్ కింది భాగంలో డ్రగ్స్ పెట్టారు. కింది భాగంలో కొకైన్ నింపి నలుగురు మహిళలను తనిఖీ చేయగా కొకైన్ వెలుగులోకి వచ్చింది. కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎవరు వద్ద నుంచి తీసుకొస్తారనే కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు రూ.50కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. లావోస్ లో వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు. హైదరాబాద్ లో ఎవరికీ డెలివరీ చేయనున్నారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ని కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news