Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు పడనున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే అవకాశముంది.
దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు ఆదిలాబాద్, కుమురంభీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో ఈ అల్పపీడనం యొక్క గరిష్ట వర్షపాతం ఉంది. మరో 4 గంటల పాటు ఈ భారీ వర్షాలు ఈ జిల్లాలకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.