హైదరాబాద్ బాట పట్టిన నగరవాసులు..కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్

-

హైదరాబాద్ బాట పట్టారు నగరవాసులు. బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ముగియడంతో నగరానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు జనాలు. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా నిలిచిపోతున్నాయి వాహనాలు. ముఖ్యంగా విజయవాడ-హైదరాబాద్ హైవే పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర నిలిచాయి వాహనాలు.

Heavy stalled vehicles at toll plazas

అటు కరీంనగర్- హైదరాబాద్ రాజీవ్ రహదారి దుద్దేడ టోల్ ప్లాజా వద్ద కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయితే.. ఇవాళ ఉదయం నుంచి ట్రాఫిక్‌ మరింత పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో జనాలు రద్దీగా వస్తున్నాయి. అటు ఆర్టీసీ బస్సుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news