BREAKING : ఎంపీ అర్వింద్‌ ఇంటి ముందు వడ్లు పారబోసి రైతుల ఆందోళన..వీడియో వైరల్

-

బిజెపి నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిని చుట్టుముట్టిన రైతులు వడ్లు కొనాలని ఆందోళన కు దిగారు. ఎంపీ అరవింద్, ప్రధాని నరేంద్రమోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు నిజామాబాద్ రైతులు. దీంతో పెర్కిట్ లోని ధర్మపురి అరవింద్ ఓ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు ఈరోజు రైతుల సెగ తాకింది. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అప్పటినుంచి రైతు వ్యతిరేకి అయిన ఎంపీ అరవింద్ రైతులతో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటునే ఉన్నాడు. జిల్లా కేంద్రంలో ఎక్కడ పర్యటించిన రైతులు ఆయనను అడ్డుకుంటున్నారు. మొన్న ఆర్మూరు రైతులు అయితే ఏకంగా గ్రామాల నుంచి ఉరికించి పరుగులు పెట్టించారు.

గ్రామ పర్యటనలు మానుకుని ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ధర్మపురి అరవింద్ కు ఆర్మూర్ పట్టణంలో తన నివాసం లో ఇంకో ఝలక్ ఇచ్చారు రైతులు. ఏకంగా రైతులు ఈ సారి తమ వలలు కేంద్రం కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము పండించిన ధర్మపురి అరవింద్ ఇంటి ముందు ధాన్యాన్ని పారబోసి నిరసన తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా నిన్న ధాన్యం కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news