నారాయణపేట జిల్లాల్లో తీవ్ర విషాదం.. తల్లీకూతురు మృతి

-

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వాగులు, చెరువులు ఏరులై పారుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే, కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కొత్తపల్లి మండలంలో భారీగా కురిసిన వర్షాలకు గాను ఇల్లు కూలి తల్లీకూతురు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇల్లు శిథిలావస్థలో ఉండటం, వర్షాలకు గోడలు మొత్తం తడిచిపోయి కూలినట్లు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఉంటున్న తల్లీకూతురు నిద్రలోనే మరణించారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వెళ్లి వివరాలు ఆరా తీశారు. మృతులు హనుమమ్మ (78),అంజిలమ్మ (38)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news