హైదరాబాద్‌ విషాదం..హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు

-

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఎస్బిఐ కాలనీ దామోదరం సంజీవయ్య నగర్ లో హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు అయింది. కనిపించకుండా పోయిన లక్ష్మీ (55) నాలాలో పడి గల్లంతు అయింది. ఇంటి వద్ద పగిలిన గాజులు కనిపించడంతో నాలాలో పడిపోయినట్లు కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు.

ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు వివాహం జరగడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు లక్ష్మి. ఇటీవల వర్షానికి ఉన్న ఇంటి గోడ కూలిపోవడంతో ప్రహరీ లేక ఇబ్బందులు పడుతోంది మహిళ. లక్ష్మి ఇంట్లో గ్యాస్ స్టవ్ పై వంట చేస్తూ బియ్యం.. సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టడం అక్కడే చెప్పులు ఉండడంతో నాలాలో పడిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. గాంధీనగర్ పోలీసులకు లక్ష్మీ కుమార్తె సునీత ఫిర్యాదు చేయగా.. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news