వర్షాలపై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం..!

-

హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవగా.. మరికొన్ని జిల్లాలో భారీ వర్షాపాతం రికార్డయ్యింది. తాజాగా వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. గురువారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలుజిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news