చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం

-

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉదయం నుంచి చాలా చోట్ల వాన పడుతోంది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ఈరోజు ఉదయం నుంచి దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, కర్మాన్‌ఘాట్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌, చార్మినార్‌, కోఠి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఉదయాన్నే పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం జాబితాండలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. మరోవైపు ఈదురు గాలల వర్షం కారణంగా పలుచోట్ల రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. గాలుల కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయాయి. అలాగే, వరి పంట, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.

Read more RELATED
Recommended to you

Latest news