BREAKING : ఐసెట్ ఫలితాలు విడుదల… మొదటి మూడు ర్యాంక్ లు వారికే !

-

గత నెల ఆఖరి వారంలో డిగ్రీ పూర్తి అయిన తర్వాత MBA మరియు MCA కోర్స్ లలో చేరడానికి తెలంగాణ ఉన్నత విద్య మండలి ఐసెట్ అనే ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ పరీక్ష ఫలితాలు కాసేపటి క్రితమే ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాలలో సూర్యాపేట జిల్లాకు చెందిన నూకల శరన్ కుమార్ మొదటి ర్యాంక్ ను సాధించాడు. అనంతరం రెండు మరియు మూడవ ర్యాంక్ లలో హైదరాబాద్ కు చెందిన సాయి నవీన్ మరియు రవితేజ నిలిచారు. దీనితో ఈ ముగ్గురు విద్యార్థుల కుటుంబాలలో ఆనందం విరబూసింది. వీరు కోరుకున్న యూనివర్సిటీ కాలేజ్ లో సీటును పొందే అవకాశాన్ని దక్కించుకున్నారు అని చెప్పాలి.

ఇంకా చెప్పాలంటే ఇప్పటికే కొన్ని టాప్ కాలేజీలు వీరిని కాంటాక్ట్ చేసి మా కాలేజీలో చేరండి అంటూ డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news