ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం – రావెల కిషోర్ బాబు

-

చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని.. ఆంధ్రప్రదేశ్లో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామని అన్నారు ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధితో కలిసి రావేలా నేడు హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి కుక్కలు చంపిన విస్తరిలా తయారయింది అన్నారు.

టిడిపి – వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని విమర్శించారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామన్నారు. తన చివరి శ్వాస వరకు కేసీఆర్ తోనే ఉంటానని స్పష్టం చేశారు రావెల. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినట్లే ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని విమర్శించారు. దర్యాప్తు సంస్థల పేరుతో రాజకీయ పార్టీలను అణిచివేయాలని చూస్తున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news