ఎల్బీ స్టేడియంలో గణేష్ విగ్రహాలు నిమర్జనం చేస్తే ఊరుకోం – వి హనుమంతరావు

-

ఎల్బీ స్టేడియంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేస్తే ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ఈ నెల 31న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని.. ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియం, అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో వినాయక చవితి ఉత్సవాల నిమర్జనం ఆలోచన దుర్మార్గమని అన్నారు. అవసరమైనప్పుడు వివిధ ప్రభుత్వ మీటింగులు, కొన్ని పండుగలు ఉత్సవాలు నిర్వహించుకుంటూ.. రోజు వివిధ ఆటలు ఆడేందుకు ఈ గ్రౌండ్ లు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు.

ప్రతిరోజు వివిధ క్రీడల ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? అంటూ ప్రశ్నించారు. దీనిపై క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించాలని అన్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను బాగు చేసి అందులో నిమర్జనం చేయాలని సూచించారు విహెచ్. ఎక్కడి వారు అక్కడే వాళ్ళ పరిసర ప్రాంతాల చెరువుల్లో నిమర్జనం చేసుకోవాలని సూచించారు. అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో నిమర్జనం ఏర్పాట్లు చేస్తే కూల్చేస్తామంటూ హెచ్చరించారు విహెచ్.

Read more RELATED
Recommended to you

Latest news