ఫేక్ పోస్టులు పెడితే జైలు పాలే.. ఎంపీ చామల హెచ్చరిక

-

కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లడమే బీఆర్ఎస్ పనా..? చిల్లర పైసలకు ఆశపడి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే జైలు పాలవుతారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ పై సంచలన విమర్శలు చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ఏ పార్టీ కూడా తప్పుడు ప్రచారాలను చేయద్దని.. అలా చేసే వారిని ప్రోత్సహించకూడదని అన్నారు.

తెలంగాణ భవిష్యత్ కోసం, ప్రజల అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, అధికార పార్టీకి ఏవైనా సలహాలు, ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వదలిస్తే.. కచ్చితంగా ఇవ్వొచ్చని సూచించారు. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించుకూడదని తెలిపారు. చిల్లర పైసలకు ఆశపడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి జైలుకు వెళ్తే వాటిని వారిని కాపాడేవారు కూడా ఎవ్వరూ ఉండరని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news