సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై డీకే అరుణ సంచలన కామెంట్స్

-

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీజేపీ కీలక నేత, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అబద్దపు హామీలతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. సరిగ్గా అమలు చేయడం చేతకాక ప్రతీ హామీలోనూ కోత పెడతున్నారని మండిపడ్డారు. తక్షణమే రైతు రుణమాఫీ లెక్కలు విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

రాష్ట్రంలో అభివృద్ది పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం అమెరికా పర్యటన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. అసలు రేవంత్ రెడ్డి పర్యటనతో రాష్ట్రానికీ ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూడాలని అనుమానం వ్యక్తం చేశారు. కొత్త కంపెనీలు వస్తాయో లేక.. పాత కంపెనీలతోనే హడావుడి చేస్తారో చూడాలని ఎద్దేవా చేసారు. మరోవైపు ఎంపీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణకి మాటల యుద్దం జరిగిన విషయం తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Latest news