సిటీ సివల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ దిల్లీకి చెందిన భాజపా ఎంపీ పర్వేశ్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజుందర్‌ సిర్సాలపై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఆమె మంగళవారం హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు 9వ చీఫ్‌ జడ్జి ముందు ఇంజక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వాళ్లు తనకు క్షమాపణ చెప్పేలా చేయాలని కోర్టుని కోరారు. తనపై వస్తున్న ఆరోపణలను పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కవిత పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని ఎంపీ పర్వేశ్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్‌ సిర్సాలను కోర్టు ఆదేశించింది. సభలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేయొద్దని పేర్కొంటూ పర్వేశ్‌వర్మ, మజుందర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 13కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news