పండుగ రోజు ఇలాంటి బ్యాడ్ న్యూస్ వింటా అనుకోలేదు.. ఐపీఎస్ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్..!

-

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ రతన్ హఠాన్మరణంతో స్టేట్ పోలీస్ డిపార్మెంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుకు గురై కన్నుమూసిన రాజీవ్ రతన్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన బ్యాచ్మేట్ మరణంపై ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నా ఐపీఎస్ (1991) బ్యాచ్ మేట్ రాజీవ్ రతన్ గుండె పోటుకు గురై మరణించారన్న బాధకరమైన వార్తతో ఇవాళ ఉదయం నిద్రలేచాను.

ఉగాది పండుగ రోజున ఇలాంటి వార్త వినడానికి ఇష్టపడేది కాదు. గత నెలలోనే మేము ఆల్ ఇండియా పోలీస్ గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొనడానికి షిల్లాంగ్ వెళ్ళాము. రెండు వారాల క్రితమే బౌల్డర్ హిల్స్లో మేము గోల్ఫ్ ఆడాము. ఆయన భార్య, కుమారునికి నా ప్రగాఢ సానుభూతి” అని సీవీ ఆనంద ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి గోల్ఫ్ ఆడిన ఫొటోలను షేర్ చేశారు. కాగా, ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్ రతన్, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ 1991 ఐపీఎస్ బ్యాచ్మేట్స్. ఈ నేపథ్యంలోనే తన బ్యాచ్మేట్ హఠాన్మరణం చెందడంతో సీవీ ఆనంద్ ఎమోషనల్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news