తెలంగాణ విజిలెన్స్ డీజీగా ఐపీఎస్ జితేందర్

-

పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో అత్యవసరమైనవి తప్ప మిగిలిన ప్రభుత్వ కార్యాకలాపాలు నిలిచిపోయాయి. ఎలక్షన్ కోడ్ వల్ల రాష్ట్రంలో బదిలీలు, ప్రమోషన్లు, నియామకాలు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. అయితే, ఎట్టకేలకు జూన్ 6వ తేదీతో లోక్ సభ ఎలక్షన్ కోడ్ ముగియడంతో తిరిగి స్టేట్ గవర్నమెంట్ బదిలీలు, ప్రమోషన్లు, నియామకాల ప్రక్రియ స్టార్ట్ చేసింది.

 

ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ విజిలెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ని నియమించింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ ను ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆదిత్య నాథ్ గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news