వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలి : చంద్రబాబు

-

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయమై ఆయన పార్టీ నేతలను  అడిగి తెలుసుకున్నారు.

వైసీపీ  కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం క్యాడర్ కి చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు సైతం అప్రమత్తంగా ఉండి.. ఎలాంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. కొంత మంది వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో టీడీపీ నేతలు కూడా చంద్రబాబు మాట కట్టుబడి ఉండనున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news