బీజేపీలో చేరేందుకు వెళ్లిన చికోటీ ప్రవీణ్‌కు చేదు అనుభవం..!

-

బీజేపీలో చేరేందుకు చూసిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముందుగా నిర్ణయించిన విధంగా చికోటి ప్రవీణ్ మంగళవారం బీజేపీలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇందుకోసం చీకోటి ప్రవీణ్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో కలిసి సంతోష్ నగర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరారు. అయితే చీకోటి రాకకముందే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దీంతో చీకోటి ప్రవీణ్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

అయితే ఈ పరిణామాలపై చీకోటి ప్రవీణ్ అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉంటే, ఈ పరిమాణాలపై చీకోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు, తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలకు మధ్య కొంత పొరపాటు జరిగిందని అన్నారు. ‘‘ఏదో కార్యక్రమంలో బిజీగా ఉన్నందున నాయకులు ఎవరూ ఆఫీసులో లేరని నాకు చెప్పారు. దీనిపై జాతీయ స్థాయి నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాను. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది’’ అని చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news