థాంక్యూ మల్కాజ్ గిరి అంటూ ఈటల ఎమోషనల్ ట్వీట్..!

-

దేశంలో 18వ లోక్ సభ కొలుదీరిన సందర్భంగా ఎంపీల ప్రమాణ స్వీకారం రెండు రోజు కొనసాగుతోంది. ఇవాళ సీనియర్ లీడర్, బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ‘థాంక్యూ మల్కాజిగిరి’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రమాణం చేస్తున్న వీడియోను ప్రజలతో పంచుకున్నారు.

‘ప్రియమైన మల్కాజిగిరి ప్రజలారా, ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన 18వ లోక్ సభలో మీ పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మీ తిరుగులేని మద్దతు, విశ్వాసం, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి నాకు శక్తినిచ్చాయి. కలిసి అభివృద్ధి ప్రయాణాన్ని ప్రారంభించాము. మీ పట్ల నా నిబద్ధత తిరుగులేనిది, మీ సమస్యలను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రధాని మోడీ నాయకత్వంలో రాబోయే ఐదేళ్లలో భారత్ అపూర్వమైన అభివృద్ధి సాధించగలదని నేను విశ్వసిస్తున్నాను. మోడీ సర్కార్ నిబద్ధత వల్ల ఇప్పటికే ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదిని ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news