ప్రధాని మోడీపై తిరుగుబాటు మొదలైంది – జగదీష్ రెడ్డి

-

ప్రధాని మోడీపై తిరుగుబాటు మొదలైందని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని ఆంజనేయ స్వామి దేవాలయం లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజల చేశారు మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ, బిజెపి పైన తిరుగుబాటుకు నిదర్శనమే కర్ణాటక ఎన్నికల ఫలితం అని చెప్పారు. గతంలో తొమ్మిది రాష్ట్రాలలో అక్రమ పద్ధతిలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని వివరించారు. నియంత పాలనను సహించబోమని బిజెపికి వ్యతిరేకంగా భారత ప్రజలు ఓటు వేస్తున్నారని వెల్లడించారు. అనేక రాష్ట్రాలలో ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినా నిలబెట్టుకోవడంలేదు… బిజెమి మీద ఉన్న వ్యతిరేకతతో కర్ణాటకలో మరోసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారన్నారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news