మూడు రాజధానులు కాదు…3 రాష్ట్రాలు చేసుకోండి – జగ్గారెడ్డి

-

వైఎస్‌ షర్మిలపై మరోసారి జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. షర్మిలకు నాతో పంచాయితీ ఎందో అర్దం అవ్వడం లేదని.. కెటిఆర్ కి కోవర్ట్ అని నింద వేశారని షర్మిలపై భగ్గుమన్నారు. షర్మిల వ్యవహరం చుట్టరికం తోక పట్టుకొని తిరిగినట్టు ఉందని… అర్జెంట్ గా షర్మిల సీఎం అయిపోవాలి.. అదే ఆమె కోరిక అని సెటైర్‌ వేశారు.

విజయమ్మకి ఓ సలహా…. జగన్ కి చెప్పి షర్మిలను సీఎం చేయండంటూ ఎద్దేవా చేశారు. మీ ఇంటి పంచాయితీ జనానికి చుట్టకండన్నారు. ఏపీలో మూడు రాజధానుల పంచాయతీ నడుస్తుందన్నారు. మీ ఇంట్లో సీఎంల పంచాయితీ కోసం… మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండని ఎద్దేవా చేశారు. జగన్… మోడీకి గులాం అయ్యారు కాబట్టి మూడు రాష్ట్రాలు చేయండని చురకలు అంటించారు. మీ ఫ్యామిలీ అంతా మోడీ దగ్గర కూర్చొని ..మూడు రాష్ట్రాలు చేసుకోండని జగ్గారెడ్డి ఓ రేంజ్‌ లో ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news