BRS పార్టీకి జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా

-

జగిత్యాల జిల్లా BRS పార్టీ లో అనూహ్య పరిణామాలు  చేసుకుంటున్నాయి. అధికార పార్టీ మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తన కౌన్సిలర్‌ పదవీతో పాటుగా బీఆర్​ఎస్​ పార్టీకీ రాజీనామా చేశారు. గత కొంత కాలంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు, బోగ శ్రావణిల మధ్య విభేదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజాగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రాజీనామా  జిల్లాలో చర్చనీయాంశమైంది. తన లేఖను మంత్రి కేటీఆర్​కు​ పంపుతున్నట్లు శ్రావణి తెలిపారు.

జగిత్యాలలో ఇంత జరుగుతున్నా పార్టీ కనీసం పట్టించుకోవడం లేదని శ్రావణి అన్నారు. కనీస సహకారం లేదని మండిపడ్డారు. రాజీనామా చేసినా పార్టీ పట్టించుకోక పోవడం వల్లే ఇపుడు తన కౌన్సిలర్ పదవికి, పార్టీకి రాజీనామా  చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో mlc కవిత అనుచరులను పార్టీకి దూరం చేయడమే ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రావణి.. సంజయ్​కుమార్​ ఓటమికి మొదటి కారణం తానే అవుతానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news