జేడీ లక్ష్మీనారాయణ ఓ చదువుకున్న మూర్ఖుడు : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

-

జేడీ లక్ష్మీనారాయణ ఓ చదవుకున్న మూర్ఖుడు అని, ఆయనకు సిగ్గు శరం లేదని వరంగల్ పశ్చిమ నియోజవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లపై నిప్పులు చెరిగారు. మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ అంటే తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ నిన్న మొన్న చూసిన వార్తలతో ఆయన మీద గౌరవం పోయిందని అన్నారు.

ఏనుగు రాకేష్ రెడ్డికి సపోర్టు చేయడానికి సిగ్గు శరం ఉండాలని, ఎలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలో, ఏ పార్టీ బలపరిచిన వ్యక్తులకు చేయాలో తెలియని చదువుకున్న మూర్ఖుడని దుయ్యబట్టారు. నీతి పరుడని.., నిజాయితీ పరుడని చాలా గౌరవం ఉండేదని.. కానీ నీలాంటి వ్యక్తులు డబ్బులకు అమ్ముడు పోతున్నారా..? అని ప్రశ్నించారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పై కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news