గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. జే డీ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ కి మద్దతు

-

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి జనగాం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్థానం ఇప్పుడు ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. మే 27న ఎన్నిక జరుగనుంది. అధికార కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డిలు ప్రధాన పార్టీల తరుపున బరిలో నిలవనున్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ సార్ కూడా పోటీలో ఉన్నారు.  ప్రధాన పోటీ వీరి నలుగురి మధ్యనే కొనసాగనుంది.

ఈ క్రమంలోనే ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తన మద్దతును ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో “రాజకీయాల్లోIయువతరాన్ని, నీతి, నిజాయితీ ఉన్నవారు రావలని కోరుకుంటున్నా. ఓ వ్యాపారంలో వ్యక్తి నష్టపోతే.. ఆయన కొంతమంది నష్టపోవచ్చని అన్నారు. కానీ, రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్ధపరులు, అవినీతి చేసే వాళ్లు వస్తే సమాజానికే చెడు అవుతుందని అన్నారు. సమాజం కోసం నిలబడి పనిచేసే మంచి నాయకులు, యువతరం ఇప్పుడు అవసరం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల అభ్యర్థిగా తన మిత్రుడు ఏనుగుల రాకేష్రెడ్డిని గెలిపించాలి’ అంటూ ఓటర్లను అభ్యర్థించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news