పార్టీ మారుతున్న నేతలపై జోగు రామన్న ఫైర్…అవకాశవాదులంటూ !

-

పార్టీ మారుతున్న నేతలపై మాజీ మంత్రి జోగు రామన్న ఫైర్ అయ్యారు. ప్రజలు ఒక్క వైపు నాయకులు ఒక్కవైపు అవుతున్నారు…అవకాశవాదం కోసం పార్టీలు మారుతున్నారు….ఆస్తులు కాపాడు కోవడం కోసం పార్టీలు మారుతున్నారని నిప్పులు చెరిగారు. అధికారం కోసం ఆరాటం తో కండువా మారుతున్నారన్నారు. ఆదిలాబాద్ ఎంపి స్థానం లో బీజేపికి మాకే పోటీ… అది నామమాత్రమేనన్నారు. జనం ను పక్కదారి పట్టించడానికి ఫొన్ ట్యాపింగ్ అంటూ విమర్శలు చేశారు.

దానికి సంబంధించిన వారిని పట్టుకోండి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండని ఫైర్‌ అయ్యారు. కాళేశ్వరం అయిపోయింది ఇప్పుడు రోజు ఫొన్ ట్యాపింగ్ అంటున్నాడు….ప్రజలను డైవర్ట్ కోసం మాత్రమేనని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపుతున్నారు…. 3 వేల కోట్లు వసూల్ చేసి,
2 వేల 5 వందల కోట్లు ఢిల్లీకి పంపారని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జోగు రామన్న.

Read more RELATED
Recommended to you

Latest news