బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రాక్షస సమితి : జేపీ నడ్డా

-

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా పేర్కొన్నారు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అంటే కమీషన్, క్రిమినలైజేషన్, కరప్షన్ పేర్కొన్నారు. దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు నరేంద్ర మోడీకి ఓటు వేయండి. తెలంగాణలో బీజేపీని గెలిపించండి.

దాదాపు పదేళ్ల నుంచి బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేసింది అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెవరేర్చలేదని పేర్కొన్నారు. నిరుద్యోగులకు రూ.3వేలు బృతి ఇస్తానని కేసీఆర్ ఇవ్వలేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి బీజేపీనే ప్రత్యామ్నాయమని తెలిపారు. ఈసారి బీజేపీ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు. కర్ణాటక నుంచి తెలంగాణకు భారీగా డబ్బు చేరుతుంది.. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news