నేడు విద్యుత్​శాఖ ఇంజినీర్​ రఘును విచారించనున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్

-

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కమిషన్ ఈ వ్యవహారానికి సంబంధించి గుత్తేదార్లు, ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కమిషన్ ఎదుట విద్యుత్​ శాఖ ఇంజినీర్​ రఘు నేడు విచారణకు హాజరు కానున్నారు. సాంకేతికపరమైన అంశాల విచారణ తుది దశకు చేరుకోగా ఆర్థిక అంశాలపై విచారణను వేగవంతం చేసేందుకు కమిషన్ సిద్ధమైంది.

అందులో భాగంగా ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు, ఇతరుల నుంచి కమిషన్ అవసరమైన సమాచారం, వివరాలు తీసుకుంటోంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు పలుమార్లు బహిరంగంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, సమాచారం, వివరాలను కమిషన్ తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కమిషన్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news