టిఆర్ఎస్ పార్టీపై హై కోర్టును ఆశ్రయించిన కేఏ పాల్

-

టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు పెట్టినందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే గతంలో ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టవద్దని… ఒకవేళ ఫ్లెక్సీలు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉత్తర్వులు ఇచ్చింది అని గుర్తు చేశారు.

అయితే ప్రభుత్వ నిబంధనలను తుంగలో చూపుతూ అధికార టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలను పెట్టారని ఆరోపించారు. పార్టీ ఫ్లెక్సీలను తొందరగా తొలగించాలని కేఏపాల్ డిమాండ్ చేశారు. క్లాసిఫైడ్స్ తో ప్రచారం చేసుకోవడం తప్పు కాదన్న ఆయన… కానీ రోడ్డు మధ్యలో ఫిక్స్ లు పెట్టడం తప్పని ఫైర్ అయ్యారు. వాటి వల్ల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news