నేడు కాంగ్రెస్ లో చేరనున్న కడియం శ్రీహరి, కావ్య ?

-

Kadiam Srihari :బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవనున్న.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య…అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారట. ఇది ఇలా ఉండగా, BRS అధినేత కేసిఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు.

Kadiam Srihari and Kavya will join the Congress today

ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖ లో తెలిపిన కడియం కావ్య….బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న కావ్య…ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని వెల్లడించారు. కెసిఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు కడియం కావ్య. అటు కావ్య లేఖ ను దృవీకరించారు కడియం శ్రీ హరి.

 

Read more RELATED
Recommended to you

Latest news