వరంగల్ బరి నుంచి తప్పుకున్న కడియం శ్రీహరి కూతురు !

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కో నేత గులాబీ పార్టీని వీడి అధికారపక్షమైన కాంగ్రెస్లో చేరుతున్నారు. ఏ క్షణాన ఏ లీడర్ వెళ్తారో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కడియం శ్రీహరి కుటుంబం ఊహించని షాక్ ఇచ్చింది.

Kadiam Srihari’s daughter who left Warangal Bari

BRS అధినేత కేసిఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖ లో తెలిపిన కడియం కావ్య….బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న కావ్య…ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని వెల్లడించారు. కెసిఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు కడియం కావ్య. అటు కావ్య లేఖ ను దృవీకరించారు కడియం శ్రీ హరి.

Read more RELATED
Recommended to you

Latest news