నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దది అంటూ కల్వకుంట్ల కవిత చిట్ చాట్ లో పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నానని వెల్లడించారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మెదటి కూతుర్ని నేనేనని… ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని గుర్తు చేశారు.

కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారని బాంబ్ పేల్చారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదు… కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేదని క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదని… నేను కాంగ్రెస్ లో ఎవర్నీ అప్రోచ్ కాలేదని వివరించారు. సీఎం రేవంత్ .. పదే పదే నాపేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో? అంటూ బాంబ్ పేల్చారు కల్వకుంట్ల కవిత.